ప్రజాస్వామ్యానికి పాతర వేసి నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి 

ఏ ఐ వై ఎఫ్ పట్టణ కమిటీ డిమాండ్

Aug 13, 2024 - 21:18
Aug 13, 2024 - 21:30
 0  12
ప్రజాస్వామ్యానికి పాతర వేసి నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి 

సూర్యాపేట 14 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- మోడీ సర్కార్ తీసుకొచ్చిన మూడు కొత్త చట్టాలను ' భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరమైన నేర చట్టాలు' అని నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని అఖిలభారత యువజన సమాఖ్య (AIYF ) జాతీయ సమితి పిలుపులో భాగంగా ఏఐవైఎఫ్ సూర్యాపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పి ఎస్ ఆర్ సెంటర్లో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

 ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి ఏడెల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ అధికార  దురహంకారంతోనే కేంద్రం ఇలాంటి చట్టాలను తీసుకువచ్చింది వారు నిరసన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి బలవంతంగా ఈ చట్టాలను ఆమోదించిందని, 17 వ లోక్ సభ గడువు మరి కొద్ది రోజులలో ముగుస్తుందని ,ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎవరో తరుముతున్నట్టుగా వేగంగా ఆమోదించారని,  బ్రిటిష్ పాలన నాటికంటే మరింత క్రూరమైన చట్టాలను మోదీ ప్రభుత్వం ఆమోదించి అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో నాటి జాతీయ నాయకులను జైల్లో పెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించిన' రాజద్రోహ' చట్టం అమలను సుప్రీంకోర్టు 2022లో నిలిపి వేసిందన్నారు కానీ కొత్త చట్టంలో తిరిగి రాజా ద్రోహం చట్టాన్ని దేశద్రోహం పేరుతో తీసుకొచ్చారన్నారు. ఇలాంటి చట్టాలన్నీ వెంటనే వెనక్కి తీసుకోకపోతే అఖిలభారత యువజన సమాఖ్య పోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కోశాధికారి తాళ్ల సైదులు, శ్రీనివాస్, గాలి రామకృష్ణ, రెడీమల శ్రీను,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333