ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి:
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి:
ప్రజావాణి పోర్టల్లో ఎప్పటికప్పుడు ఆన్లైన్ నమోదు..
మండల స్థాయి ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలి
ప్రజావాణి దరఖాస్తులు 68
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్....
ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మరియు మండల స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. పాత ప్రజావాణి పోర్టల్లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజావాణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. ప్రతి అధికారి తమ లాగిన్ లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని లేనియెడల వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, . ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
మండల స్థాయిలో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంపై కూడా కలెక్టర్ సమీక్షించారు. మండల స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. మండల స్థాయి సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 25 నుండి జరుగు వనమహోత్సవం సందర్భంగా సంబంధిత జిల్లా అధికారులందరూ సామూహిక వనమహోత్సవంలో పాల్గొని వారికి నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని, జిల్లా, మండల ప్రభుత్వ కార్యాలయాలలో ఆగస్టు 31 కల్లా టీ ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 43 దరఖాస్తులు, ఇరిగేషన్ 4, మున్సిపాలిటీ 4, డి డబ్ల్యు ఓ 3, మిగిలిన 14 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 68 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు.
ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, డిఆర్డిఎ పిడి సన్యాసయ్య, సిపిఓ కిషన్, డీఎస్ఓ మోహన్ బాబు, డిపిఓ యాదగిరి, డి ఏ ఓ శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు హాజరైనారు