పల్లకి సేవలో ఊరేగిన శ్రీ జమ్ములమ్మ మాత
జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- నడిగడ్డ భక్తుల ఇలవేల్పు జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ దేవత పల్లకి సేవ గురువారం పౌర్ణమి కావడంతో ఆలయ అర్చకులు దేవాలయ సిబ్బంది భక్తులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని పల్లకిలో ఉంచి పూజలు నిర్వహించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహిస్తూ అమ్మవారిని స్మరించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పురందర కుమార్ దేవాలయ సిబ్బంది అర్చకులు భక్తులు పాల్గొన్నారు.