తెలంగాణ వ్యవసాయ మార్కెట్ దడువాయి సదస్సు విజయవంతం చేయాలి
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యూనియన్ అధ్యక్షులు చిలుక గిరి
తిరుమలగిరి 7 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ వ్యవసాయ మార్కెట్ దడ్వాయి సమావేశం మంగళవారం రవీంద్ర భారతిలో సమావేశం జరుగుతుందని తిరుమలగిరి మార్కెట్ దాడ్వాయి అధ్యక్షులు చిలుక గిరి పిలుపునిచ్చారు.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి,టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,ఐఎన్ టియుసి జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర రావు, నాగన్న గౌడ్ ముఖ్య అతిథిలుగా పాల్గొంటారని తెలిపారు.కావున మంగళవారం రోజు మార్కెట్ కు సెలవు రోజు కాబట్టి మార్కెట్ తాడ్వాయి యూనియన్ సభ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు.