తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు బీ ఆర్ఎస్ పార్టీ అధినేతకేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ వార్త వేములపల్లి ఫిబ్రవరి 17: తెలంగాణ జాతిపిత,రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామములో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరం మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వృక్షార్చన లో భాగంగా మూడు మొక్కలను నాటే కార్యకమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యేనల్లమోతు భాస్కర్ రావు మరియు తిప్పన విజయసింహ రెడ్డి హాజరై ముందు రక్తదాన శిబిరంను ప్రారంబించి అనంతరం రక్త దానం ఇచ్చిన దాతలకు KM యువసేన కట్టా మల్లేష్ గౌడ్, మజ్జిగపు సుధాకర్ రెడ్డి,గౌరు శ్రీనివాస్ ఆధ్వర్యంలోమేమేంటో లు, శాలువాలతో సత్కరించి అభినందించారు అనంతరం కేకు కట్ చేసి నాయకులకు తినిపించి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు తదుపరి మొక్కలను నాటారు
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని,మరల వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన రావాలని పేద, మధ్యతరగతి ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించాలని ఆకాంక్షించారు
కార్యక్రమములో ధనావత్ చిట్టిబాబు నాయక్, జొన్నలగడ్డ రంగా రెడ్డి, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి,పాలుట్ల బాబయ్య,పేరాల కృపాకర్ రావు,జేరిపోతుల రాములు గౌడ్,పేరాల గుర్వ రావు, కాట్రగడ్డ రాజగోపాల్ రావు,నక్క శేఖర్, నక్క శ్రీధర్, పెదపంగా సైదులు,చిరుమర్రి నాగయ్య,రేగురి రాము,నాతల అంజిరెడ్డి,కొడిరెక్క పకిరయ్య,కటకురి వేణు,కోల సైదులు,కట్టా వెంకటయ్య,ధుపాటి సందీప్, ఎర్రబెల్లి చంటి,పెదపంగా సంపత్,నాగరాజు,బంటు రాము, తంగేళ్ల సైది రెడ్డి,అల్లకుంట్ల కుమార్ తదితరులు ఉన్నారు..