తెలంగాణ  అసెంబ్లీ స్పీకర్ ను కలిసిన

గట్టు కళాశాల ప్రిన్సిపల్ పి శశిధర్ రెడ్డి

May 18, 2024 - 21:41
 0  18
తెలంగాణ  అసెంబ్లీ స్పీకర్ ను కలిసిన

జోగులాంబ గద్వాల18 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:-  గట్టు .*మండల కేంద్రంలో గట్టు ప్రభుత్వకళాశాల *ప్రిన్సిపాల్ అయినటువంటి పి శశిధర్ రెడ్డి కళాశాల సమస్యలను  అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ని వివరించడం జరిగింది.వివరాల్లోకి వెళితే ఆసియా ఖండంలోనే వెనుకబడిన మండలం గట్టు మండలం విద్యాభివృద్ధిలో ముందుంటుంది అలాంటి మండల కేంద్రంలో పూర్తిస్థాయిలో  విద్య అభివృద్ధికై కృషి చేయుటకు దయ హృదయంతో కళాశాల ప్రిన్సిపాల్  తనవంతుగా తెలంగాణ సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ని  కలిసి కళాశాల అభివృద్ధికి మీ సహకారం తప్పకుండా కావాలని, కళాశాలలో సైన్స్ సబ్జెక్టుల కు అనుమతి కావాలని, అధ్యాపకుల కొరత ఉందని మరియు పరికరాల సదుపాయాల కొరత ఉందిని కళాశాల అభివృద్ధికి ఆటంకాలు ఎన్ని ఉన్న,కళాశాల విద్యార్థులు  ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాపర్స్ గా ఫలితాలుగా కూడా సాధించడం జరిగింది. అని పేర్కొనగా వెంటనే సభాపతి  కమిషనర్ కి ఫోన్ చేసి గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.  

 ఇంటర్మీడియట్  కమిషనర్  తక్షణమే ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొనడం జరిగింది . మీ సహకారం ఉంటే తప్పకుండా కళాశాల సమస్యలులేకుండా చేయగలుగుతారని కళాశాల అభివృద్ధికి మీ వంతు సహకారం తప్పకుండా ఉండాలని గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు  ధన్యవాదాలు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333