తిరుమలగిరి మండలంలో పారా మిలటరీ బలగాల కవాతు

Apr 29, 2024 - 21:43
Apr 30, 2024 - 20:45
 0  235
తిరుమలగిరి మండలంలో పారా మిలటరీ బలగాల  కవాతు

 తిరుమలగిరి 30 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- వచ్చేనెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి అలజడులు జరగకుండా ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలనే కూడా ఉద్దేశంతో తిరుమలగిరి మండలంలోని తాటిపాముల మామిడాల జలాల్పురం వెలిశాల గ్రామాలలో నాగారం సిఐ రఘువిర్ రెడ్డి తిరుమలగిరి ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసుల కవాతు నిర్వహించారు.

     ఈ సందర్భంగా నాగారం సిఐ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చేనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గ్రామాలలో ఎలాంటి ఘర్షణలు అలజడులు జరగకుండా ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా పారా మిలిటరీ బలగాలచే కవాతు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు ఎన్నికల్లో ఎవరైనా సంఘవిద్రోక శక్తులు గాని గ్రామాల్లో అలజడులు సృష్టిస్తే వారిపై నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తూ చట్ట పరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు అలాంటి ఎవరైనా గ్రామాల్లో సంచరించిన అలజడలకు పాల్పడే ఉద్దేశం ఉన్న ముందు జాగ్రతగా తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034