డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చేతుల మీదుగా 45 కోట్ల నిధుల ప్రొసీడింగ్ పత్రాలు అందుకున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
జోగులాంబ గద్వాల 21 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : అలంపూరు. నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలకు 45 కోట్ల నిధులు మంజూరు... అయిజ, వడ్డేపల్లి, అలంపూరు మున్సిపాలిటీలకు.. గాను ఒక్కొక్క మున్సిపాలిటీకి 15 కోట్ల నిధులు.. అభివృద్ధి పనులకు..
హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతులమీదుగా... ప్రొసీడింగ్ పత్రాలను అందుకున్న ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్... అలంపూర్ మున్సిపాలిటీ కి కేటాయించిన 15 కోట్ల అభివృద్ధి నిధుల ప్రొసీడింగ్ పత్రాలను అలంపూరు ఇస్మాయిల్ కు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అందజేశారు..
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెలికం అడ్వైజరీ కమిటీ మెంబర్ ఇస్మాయిల్, మహేష్ గౌడ్ వెంట ఉన్నారు...