డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది నిరసన కార్యక్రమం

Aug 17, 2024 - 21:16
Aug 17, 2024 - 21:17
 0  62
డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది నిరసన కార్యక్రమం

అడ్డగూడూరు 17 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- అడ్డగూడూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనలో పిజి విద్యార్థి హత్య చేసిన సంఘటన పట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అడ్డగూడూరు వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..విద్యార్థి మృతిపట్ల దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూ ఈ ఘటనలో బాధ్యత వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.ఈ క్రూరమైన సంఘటన మరువలేనిది.అలాగే ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వైద్యాధికారి స్పష్టం చేసారు.వైద్య సిబ్బంది పై తరుచూ జరిగే అణచివేత చర్యలు నిలిపివేయాలని కోరుతు సమ్మె నిర్వహిస్తున్నాం అని తెలిపారు.