తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల  జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  డియంహెచ్ఓ డాక్టర్ శశికళ...!          

Apr 3, 2024 - 19:20
 0  78
తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల  జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   డియంహెచ్ఓ డాక్టర్ శశికళ...!          

 జోగులాంబ గద్వాల 3 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లకు మరియు జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బందికి గ్రామాలలో ఉన్న ప్రజలకు పట్టణ ప్రజలకు రోజురోజుకు ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల వడదెబ్బకు గురికాకుండా గ్రామాలలో ఆశా కార్యకర్తల సహాయంతో ఇంటింటికి వెళ్లి ఆరోగ్య క్షేమ సమాచారములు తెలుసుకొని ఆరోగ్య సలహాలు ఇస్తూ ఓఆర్ఎస్ ప్యాకెట్లుకూడా పంపిణీ చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వడదెబ్బకు గురి కాకుండా అవసరమైన వారు మాత్రమే ఉదయం వచ్చి పనులు చేసుకుని వెళ్లాలని మధ్యాహ్నవేళలో బయటికి రాకూడదని తరచూ నీటిని, మరియు ఇళ్లలో పలుచని మజ్జిగ ,నిమ్మరసం తయారు చేసుకొని తీసుకోవాలని తెలిపారు. ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ క్రింది విధంగా తెలపడం అయినది. ఎండలో బయటకు వచ్చినచో తలకు టోపీ లేదా టవల్ చుట్టుకొని, కళ్ళకు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు తెలుపు రంగు కాటన్ వస్త్రాలు ధరించాలని,మరియు దాహం వేయకపోయినా తరచూ నీళ్ళు త్రాగాలని, ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీళ్లు నిమ్మరసం కొబ్బరి నీళ్లు తాగడం మంచిదని,వడదెబ్బ తగిలిన వారికి తల తిరగడం వాంతులు చెమట పట్టకపోవడం,శరీర ఉష్ణోగ్రత పెరగడం,వణుకు పుట్టడం, మగత నిద్రలేఖ కలవరింతలు ఉండడం , ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి కలిగి ఉండడం, వంటి లక్షణాలు ఉన్నవారు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారులను సంప్రదించాలని జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ తెలియజేస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333