టిడిపి ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ........వేమూరి సత్యనారాయణ

Jun 4, 2024 - 18:04
Jun 4, 2024 - 18:49
 0  12
టిడిపి ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ........వేమూరి సత్యనారాయణ

మునగాల 04 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- ఆంధ్రప్రదేశ్ లో టిడిపి జనసేన బిజెపి కూటమి ఘనవిజయం సాధించడం పట్ల మండల పరిధిలోని నరసింహపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కూటమి తరపున చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తగిన మెజార్టీ రావడం సంతోషదాయకమని అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సామరసపూర్వకంగా పరిష్కరించుకొని అభివృద్ధి పథంగా ముందుకు వెళ్లేందుకు ఇరువురు ముఖ్యమంత్రులు చొరవ చూపాలని, అదేవిధంగా ప్రస్తుతం కేంద్రంలో అధికారం చేపట్టబోయే పార్టీలకు సరైన మెజార్టీ రాకపోవడం ప్రాంతీయ పార్టీల అవసరం రావడంతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిసిన ఎంపీల మద్దతు అనివార్యమైన పక్షంలో చంద్రబాబు పాత్ర క్రియాశీలకంగా మారనున్న సందర్భంలో ప్రస్తుతం ఆయన మరొకసారి ఆకర్షణగా నిలిచారు ,కేంద్రంలో ఏర్పాటు చేయబోయే పార్టీకి తన మద్దతు అవసరమైనందున రాష్ట్రానికి మేలు జరిగే అవకాశం ఉన్నది. కావున రెండు తెలుగు రాష్ట్రాలకు చంద్రబాబు వల్ల. మేలు జరిగే అవకాశం ఉండటం శుభసూచకం అని కేంద్రంతో సత్సంబంధాలు ఏర్పరచుకొని అధిక నిధులు తెచ్చి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నాయుడు కృషి చేయాలని కోరారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State