జూలూరు నర్సయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్

అడ్డగూడూరు 21 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామానికి చెందిన జూలూరు నర్సయ్య గురువారం రోజున అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న గ్రామస్తులు కోటమర్తి గ్రామంలో వారి పార్థివదేహానికి పూలమాలవేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అడ్డగూడూరు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్ వారితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిల్లి చిన్న సోమయ్య,కాంగ్రెస్ నాయకులు రాచకొండ శ్రీను గౌడ్,బీసీ సంఘం మండల కన్వీనర్ నిమ్మల సత్తయ్య గౌడ్,రాచకొండ రవి,సైదులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.