జన జాతర సభకు భారీగా తరలిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు

జన జాతర భారీ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోతుంది : హన్మంత్ రెడ్డి 

Apr 6, 2024 - 20:35
 0  4
జన జాతర సభకు భారీగా తరలిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు

కుత్బుల్లాపూర్, తెలంగాణవార్త, ఏప్రిల్ 06:- తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహిస్తున్న జనజాతర భారీ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోనుందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడ జన జాతర బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు విచ్చేసి ఎన్నికల మానిఫెస్టోని విడుదల చేయచున్న సందర్బంగా శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తుక్కుగూడ జన జాతర బహిరంగ సభకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి, మాజీ మ్మెల్యే కూన  శ్రీశైలం గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు భూపతి రెడ్డి, జ్యోత్స్నా శివారెడ్డి, పున్నారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆర్. లక్ష్మి, బి బ్లాక్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, డివిజన్, మున్సిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు, కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మైనారిటీ  కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ యుఐ నాయకులు, ఐఎన్టియుసి నాయకులు, కార్యకర్తలు కలిసి  ఈ సభను విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున బయలుదేరి వెళ్లారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333