చెక్ అందజేత:జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు

Aug 22, 2024 - 19:25
 0  27
చెక్ అందజేత:జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు

జోగులాంబ గద్వాల 22 ఆగస్టు 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- జిల్లా పోలీస్ సాయుధ దళ కార్యాలయంలో ఏఆర్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న సురేష్ బాబు ఈ సంవత్సరం జనవరి నెలలో అనారోగ్యం తో మరణించగా  వారి భార్య సువర్తమ్మ కు కార్పస్ ఫండ్ కింద 50 వేల రూపాయలచెక్ ను, విడో ఫండ్ క్రింద పది వేల రూపాయల చెక్ ను గురువారం జిల్లా  ఎస్పీ టి. శ్రీనివాస రావు తమ ఛాంబర్ లో వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మరణించిన అధికారి   కుటుంబ ప్రస్తుత స్థితిగతులను ఎస్పీ అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏ. ఓ సతీష్ కుమార్, సూపరింటెండెంట్ నయీం, ఏఆర్ ఎస్సై బార్య సువర్తమ్మా మరియు వారి కుటుంబ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333