చిన్నోనిపల్లి ముంపుకు చెక్

Aug 24, 2024 - 16:32
Aug 24, 2024 - 16:32
 0  1
చిన్నోనిపల్లి ముంపుకు చెక్

గట్టు, గద్వాల్ జిల్లా: గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామంలో వరద ముంపు సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామాన్ని సందర్శించిన ఆర్డీఓ మరియు తహసీల్దార్ అధికారులు, రిజర్వాయర్ నుండి నీటిని బయటకు పంపేందుకు చర్యలు చేపట్టారు.

ఇటీవలి భారీ వర్షాలకు చిన్నోనిపల్లి ముంపునకు గురి కాగా, తదనంతరం నీరు బయటకు వెళ్ళేందుకు చేపట్టిన పనులను లింగాపురం గ్రామ రైతులు అడ్డుకున్నారు. స్థానిక మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చొరవతో అధికారులు చిన్నోనిపల్లి సందర్శించి, రైతులతో చర్చలు జరిపారు. రిజర్వాయర్ కింద ఉన్న రైతులను ఒప్పించి, కాలువ తవ్వించి నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సరిత రాణి, ఆర్ఐ రాజు, ఆర్ అండ్ ఆర్ ఏఈ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333