చిన్నపాటి వర్షానికి - చిన్నపాటి గాలులకే కరెంటు తీస్తున్న విద్యుత్ శాఖ అధికారులు.

Jun 7, 2024 - 20:34
 0  3

కరెంటు తీసిన తర్వాత పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు

తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆఆ వార్డు ప్రజలు

గద్వాల జిల్లా కేంద్రంలో ఈ మధ్యకాలంలో వీస్తున్న చిన్న గాలులకు మరియు చిన్న వర్షాన్నికే కరెంటు తీస్తున్న విద్యుత్ శాఖ అధికారులు, మరలా పట్టించుకోవడంలేదని ఆ ఆ వార్డు ప్రజలు సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు.  కొత్త బస్టాండ్ సమీపంలోని సుంకులమ్మ మెట్టు కాలనీలో ప్రతి చిన్న విషయానికి కరెంటు తీయడం జరుగుతుందని,  మరల కరెంటు వేయడం లేదని వార్డు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు.  దయచేసి విద్యుత్ శాఖ అధికారులు ఇట్టి విషయాన్ని గమనించి వర్షం తగ్గిన తర్వాత గాలులు తగ్గిన తర్వాత కరెంటును వెంటనే ఇవ్వాలని కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333