ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పాతర్లపహాడ్, 16 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్,:- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతర్లపహాడ్ నందు ఈరోజు 2005-2006 పదవ తరగతి పూర్వ విద్యార్థులు 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా, వారికీ విద్యాబుద్దులు నేర్పించిన గురువులందరికి పూల వర్షం తో సాధనంగా స్వాగతం పలికి, వారు చదువుకున్న రోజుల తీపి గుర్తులు, అప్పుడు జరిగిన సంఘటనలు గుర్తుచేసుకుంటూ, తమకు బోధించిన గురువులను ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమం లో గురువులు బందు కృష్ణయ్య, నారాయణ, తీగల జనార్దన్, శంకర్, వెంకటేశ్వర్లు,వెంకటరెడ్డి, సాలెహ బేగం, ఉస్మాన్, పున్నయ్య, శ్రీమానురెడ్డి, వెంకన్న, శ్రీను, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే కార్యక్రమాన్ని విజయవంతంగా కండక్ట్ చేసిన కోఆర్డినేటర్స్ ఉప్పలయ్య, అంజయ్య, వెంకటేష్, ఐలయ్య, వరుణ్, వెంకన్న, గణేష్, సంతోష్, ఉమావతి, స్పందన, సుకన్య, జ్యోతి, రజిత తదితరులు పాల్గొన్నారు.