ఘనంగా అక్షర ఉన్నత పాఠశాల లో కృష్ణాష్టమి వేడుకలు
కృష్ణుడు,గోపికల వేషధారణలో అలరించిన విద్యార్థులు..
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మున్సిపాలిటీ పరిధిలోని అక్షర ఉన్నత పాఠశాల లో ప్రిన్సిపాల్ యు .మహేందర్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకున్నారు.ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో చిన్నారులు ఉట్టిని పలగొట్టి ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ...
ఇప్పుడున్న పిల్లలకు మన పండగల గురించి వాటి ప్రాముఖ్యత తెలియజేయాలని మరియు విద్యతో పాటు ఆటలు,పాటలు ఎంతో అవసరమన్నారు ...ప్రతీ పండగకు సబందించి వాటి ప్రాముఖ్యత పిల్లలకు తెలిసేలా ఇలా కల్చరల్ ప్రోగ్రామ్ లు నిర్వహించడం సంతోషం గా ఉందని ఇలాంటి కార్యక్రమాల వలన పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలు కూడా తెలుస్తాయి అన్నారు...శ్రావణమాసం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పర్వదినం శీకృష్ణాష్టమి అని అన్నారు."కృష్ణం వందే జగద్గురుమ్" అని సకల జాతులవారూ ఆ పరమాత్మను స్తుతిస్తారు.ధర్మమునకు హాని, అధర్మమునకు అభ్యుత్థానం జరిగినపుడు, ధర్మరక్షకుడు శ్రీకృష్ణుడు తనను తానే సృజించుకొంటాడు అని తెలిపారు....
ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేష్,మాధవి పేఈటీలు నరేష్, శివరాం మరియు పాఠశాల ఉపాధ్యాయులు బృందం తదితరులు పాల్గొన్నారు