కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని కి  పూలమాల వేసి నివాళులర్పించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు

Sep 27, 2024 - 17:23
 0  2
 కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని కి  పూలమాల వేసి నివాళులర్పించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు

ఈరోజు గద్వాల పట్టణం లోని ఈదమ్మ గుడి దగ్గర  కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్బంగారామచంద్ర రెడ్డి గారు.. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ..

భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, అవే విలువలను తమ జీవితాంతం పాటించి నిరంకుశ నిజాం వ్యతిరేఖ ఉద్యమంలో మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ దేశం గర్వించదగ్గ నేత...
బడుగు బలహీన వర్గాల స్పూర్తి ప్రదాత, ప్రజాస్వామిక వాది, మానవతావాది కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు!.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే, అసెంబ్లీ పోటీ చేసిన అభ్యర్థి బలిగేర శివా రెడ్డి,జిల్లా మహిళ మోర్చ అధ్యక్షురాలు క్రిష్ణ వేణి, కౌన్సిలర్లు కుమ్మరి శ్రీనివాసులు, రజక జయశ్రీ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవా దాస్,మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మాలిమ్ ఇసాక్,ఓబీసీ నాయకులు అనిల్, డబ్బిలేటి నరసింహ, ఓంకార్,మండల అధ్యక్షుడు బాలేశ్వర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు గాంజా సాయి, గీత రెడ్డి,తిమ్మన్న తదితరులు ఉన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333