కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు..

Mar 30, 2024 - 23:00
 0  94
కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు..

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పై.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హనుమకొండ పోలీసులకు కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు ఫిర్యాదు చేశారు. అయితే హనుమకొండ పోలీసులు ఆ కేసును బంజారా హిల్స్ స్టేషన్‌కు అక్కడి పోలీసులు బదిలీ చేశారు. కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 504,505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..

అసలు కేటీఆర్ ఏమన్నారంటే..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన సికింద్రాబాద్ లోక్‌​సభ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా? బీజేపీ ప్రభుత్వమా? అని అర్థం కావడం లేదన్నారు. సామంత రాజులా రేవంత్ ఢిల్లీకి రూ.2500 కోట్లు కప్పం కట్టారని ఆరోపించారు. దీనికోసం ఆయన అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333