కరువు పాపం కాంగ్రెస్ దే 

Mar 13, 2024 - 20:31
 0  7
కరువు పాపం కాంగ్రెస్ దే 

కేసీఆర్ ఉంటే కరువొచ్చేది కాదు

ఎమ్మెల్యేలను కొనేందుకు గేట్లు తెరవడం కాదు ఎండుతున్న పంటలకు సాగర్ , శ్రీశైలం కాళేశ్వరం గేట్లు ఎత్తండి

ఎమ్మెల్యేలను కొనాలనే సోయి తప్ప ప్రజల కష్టాలపై కాంగ్రెస్ కి పట్టింపు లేదు 

ఇక ఎన్ని అబద్దాలు చెప్పిన ప్రజలు కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితి లేదు

చరిత్రలో మూడు నెలల్లో విఫలమైన ప్రభుత్వం ఇదే

కుంగిన మెడిగడ్డ పిల్లర్లకు నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి సంబంధం లేదు

ఇవ్వాళ్టికి కూడా కాళేశ్వరంలో 4 వేల క్యూసెక్కుల నీటి లభ్యత ఉంది

సాగు నీరు లేక రైతుల కంట కన్నీళ్లు కారుతున్నాయి

కరువుతో అల్లాడుతున్న రైతులను ఓదార్చే నాయకులే లేరు

తక్షణమే కరువు సమీక్షలు పెట్టాలి

ఎమ్మెల్యేలను కొనేందుకు గేట్లు తెరవడం కాదు ఎండుతున్న పంటలకు సాగర్ , శ్రీశైలం కాళేశ్వరం గేట్లు ఎత్తండి అనీ సూర్యాపేట  శాసన సభ్యులు, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై  సూర్యాపేట  జగదీష్ రెడ్డి స్పందించి కౌంటర్ వేశారు .ఎమ్మెల్యేలను కొనాలనే సోయి తప్ప ప్రజల కష్టాలపై కాంగ్రెస్ కి పట్టింపు లేదన్నారు.వ్యాపారులను బెదిరించి ఢిల్లీకి ముడుపుల సోయి తప్ప సీఎం కి వేరే యావ లేదన్నారు.ఇక ఎన్ని అబద్దాలు చెప్పినా, ప్రజలు కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితి లేదన్నారు.కరువు పాపం కాంగ్రెస్ దే అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ గేట్లు బద్దలుగొట్టేలా ఉన్నారని అన్నారు.మూడు నెలల్లో విఫలమైన ప్రభుత్వంగా తెలంగాణా లో ని కాంగ్రెస్ నిలబడిందని అన్నారు. కేసీఆర్ ఉంటే కరువొచ్చేది కాదన్నారు.డ్రామాలాడి ప్రభుత్వం నడపడం మానివేసి  ఇప్పటికైనా దమ్ముంటే సాగు నీరు ఇవ్వండి , కరువు సమీక్షలు చేయండి  అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాత వెలుగులు పోయి చీకట్లు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ పోయింది , సాగు తాగు నీరు లేదు , పంట పెట్టుబడి లేక తిరోగమన మార్పు వచ్చిందన్నారు.కాంగ్రెస్ రాజకీయ కక్ష సాధింపు తోనే తెలంగాణ కు కరువు వచ్చింది అన్నారు.కుంగిన మెడిగడ్డ పిల్లర్లకు నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి సంబంధం లేదన్నారు.ఇవ్వాళ్టికి కూడా కాళేశ్వరంలో 4 వేల క్యూసెక్కుల నీటి లభ్యత ఉందన్నారు.మీ కర్ణాటక మిత్రులతో మాట్లాడి కృష్ణా నుండి 10 టీఎంసీల నీటిని తెప్పించాలి అని డిమాండ్ చేశారు.సాగు నీరు లేక రైతుల కంట కన్నీళ్లు కారుతున్నాయనీ అన్నారు. రాష్ట్రం లో కరువుతో అల్లాడుతున్న రైతులను ఓదార్చే నాయకులే లేరనీ మండిపడ్డారు.తక్షణమే కరువు సమీక్షలు పెట్టాలని జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333