ఏపూరు నీతి సూర్యుడు ప్రార్ధన మందిరంలో పేద వృద్ధ మహిళలకు చీరల పంపిణి
బిషప్ దుర్గం ప్రభాకర్, రెవ మీసాల గురప్ప (క్రీస్తూ దాసు), పాల్వాయి అజయ్ రాణి ల చేతుల మీదుగా
ఆత్మకూర్ ( యస్ ) 6 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ఆత్మకూర్ (యస్) మండల కేంద్రం ఏపూరు గ్రామంలో స్థానిక సంఘ కాపరి పాస్టర్ రెవ.డా. పంది మార్కు నీతి సూర్యుడు ప్రార్ధన మందిరం నందు ఈ నెల తేది 4.5.6 (మంగళ, బుద, గురువారం )లలో జరిగే స్వస్థత మహాసభలలో రెండవ రోజు సభలో వంటెపాక యాదయ్య. అనసూర్య జ్ఞాపకార్ధంగా వారి అల్లుడు కూతురు పాల్వాయి అజయ్ రాణి లు ఇరవై మంది పేద వృద్ధ మహిళలకు బట్టల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రైస్తవ రాష్ట్ర నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సెబా, కోయి కోయి పాటల రచయిత మీసాల గుర్రప్ప (క్రీస్తూ దాసు ), సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిప్ అధ్యక్షులు డాక్టర్ జలగం జేమ్స్ ల చేతుల మీదుగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చివ్వేంల పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ గుగులోతు బాలాజీ నాయక్, బానోత్ సుధాకర్, రెవ పి. వి. బోయాజ్, రెవ. జిల్లా శాంసన్, రెవ. జిల్లా శాంతి కుమార్,పాస్టర్ బాకీ సుధీర్,రెవ. బల్లెం జీవప్రకాష్, పాస్టర్ బోనగిరి స్టిఫెన్, పాస్టర్ మామిడి క్రిస్టోఫర్, పవన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు