ఎంపీడీవో శంకరయ్య ఆధ్వర్యంలో ఘనంగా కాలేజీ జయంతి వేడుకలు

అడ్డగూడూరు 09 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోనీ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శ్రీ కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీడీవో శంకరయ్య. ఎంపీడీవో శంకరయ్య మాట్లాడుతూ..తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా మన తెలంగాణలో యాస బాషా ప్రకృతి సంప్రదాయం వివిధ రకాల అంశాలపై గురించి చర్చపై ఆహ్వానం కల్పించడం జరిగిందన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య,ఎంపీఓ ప్రేమలత,పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.