ఉప్పల్ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికుల ధర్నా!

Aug 26, 2024 - 13:50
 0  1
ఉప్పల్ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికుల ధర్నా!

హైదరాబాద్:ఆగస్టు 25. మెట్రో స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ కు నిరసనగా ప్రయాణీకులు ధర్నా చేపట్టారు. మియాపూర్, ఉప్పల్ మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ ఫీజు వసూళ్లు చేయాలని నిర్ణయించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రొగ్రెసివ్ యూత్ లీగ్ నేతలు ప్రయాణీకులకు మద్దతుగా నిలిచారు. 

హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణ యించడం సరికాదన్నారు. ఇలా చేయడం వల్ల ప్రయాణికులపై అదనపు భారం పడుతుందని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు.

అనేక మెట్రో స్టేషన్ల వద్ద కనీస సౌకర్యాలు లేకుండానే పార్కింగ్ ఫీజును వసూళ్లు చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇప్పుడు ప్రీ పార్కింగ్ ఎత్తి వేయడం సరియైన పద్దతి కాదని ప్రయాణికులు రోడ్డె క్కారు. పెయిడ్ పార్కింగ్ విధానాన్ని పూర్తిగా విరమిం చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333