ఇండియన్ నేషనల్ టాలెంట్ సర్చ్ ఒలంపియాడ్ లో ప్రతిభ కనబరిచిన 5వ తరగతి మానస
మానసను అభినందించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.
జోగులాంబ గద్వాల 7 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- శ్రీ చైతన్య పాఠశాలలో 5వ తరగతిచదువుతున్న మానస ఇండియన్ నేషనల్ టాలెంట్ సర్చ్ ఒలంపియాడ్ పరీక్షలలో ప్రతిభ కనబరిచి ఫలితాలు సాధించిన సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న పలువురు విద్యార్థినిలతో పాటు మానసను అభినందించారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని గద్వాల జిల్లాకు తల్లిదండ్రులకు పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇట్టి కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.