అధికారుల అనుమతి లేకుండా యదేచ్ఛగా మట్టి తరలింపు
జోగులాంబ గద్వాల 26 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి మండలంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా యదేచ్చగా మట్టి తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. ఎర్రవల్లిలోని ఒక వెంచర్కు తిమ్మాపురం నుండి వారం రోజుల నుండి మట్టిని తరలిస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఈ విషయమై తాసిల్దార్ నరేష్ ను వివరణ కోరగా తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఆయన వివరించారు. పట్ట పగలు యదేచ్చగా మట్టి తరలింపు పై అధికారుల తీరు పట్ల ప్రజలు విస్మయం చెందుతున్నారు. సమాచారం తెలిసినా కూడా మట్టి తరలింపును ఆపకుండా అధికారులు తాత్సారం చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ మట్టి తరలింపులు నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు.