30వ వార్డులో కిరణ్ తేజ 8వ తరగతి విద్యార్థి పై కుక్కల దాడి తీవ్ర గాయాలు
జోగులాంబ గద్వాల 14 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. నియోజకవర్గం, గద్వాల పురపాలక సంఘం పరిధిలోని 30 వ వార్డు సుంకులమ్మ మెట్టు కాలనీలో నివాసముంటున్న పద్మ వెంకటేష్ కుమారుడు కిరణ్ తేజ ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి పై ఇంటిముందు ఉండగా కిరణ్ తేజ పై ఐదు కుక్కలు ఒకటేసారి దాడి చేసి కరవడంతో గాయాలు అయ్యాయి. ఇట్టి విషయంపై మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ కు కంప్లైంట్ చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ సానుకూలంగా స్పందించి కుక్కలు పట్టే బృందాన్ని పిలిపించి కుక్కల బెడద లేకుండా చేపట్టేవిధంగా చర్యలు చేపట్టి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు వార్డు సభ్యులు తెలిపారు.