అయిజలో రెచ్చిపోతున్న దొంగల ముఠా
జోగులాంబ గద్వాల 14 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి;- అయిజ మండల కేంద్రంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో భయభ్రాంతులకు గురవుతున్న సామాన్య ప్రజలు.,చిరు వ్యాపారులు.. గత అర్ధరాత్రి గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న రెండు టీ స్టాల్ లో చోరీ జరిగింది...గతంలో అదే సమీపంలో ఒక టీ స్టాల్లో, ఆటో మొబైల్స్ షాప్ లో మరియు ఒక నివాస గృహం దగ్గర బైకును చోరీ చేయడం జరిగింది..దీనిపై జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన నిఘా విభాగాము పేట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసు వారిని పట్టణవాసులు కోరుతున్నారు..