సూర్యాపేట ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన

మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి.

Oct 12, 2024 - 10:27
Oct 12, 2024 - 18:09
 0  17
సూర్యాపేట ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన

సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు:

మాజీమంత్రి వర్యులు,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి.

సూర్యపేట,12 అక్టోబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- విజయదశమి పర్వదినం సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు  మాజీమంత్రి వర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరికి అన్నింటా శుభం చేకూరాలని వేడుకున్నారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, దుష్ట శక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటున్నామని వివరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, ఎప్పటికైనా మంచిదే అంతిమ విజయమని మానవాళికి చాటి చెప్పిందని ఆయన తెలిపారు. దసరా పండుగలో మన సాంప్రదాయం, సంస్కృతితో పాటూ ఆత్మీయత ఉందన్నారు.

జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు కలిగేలా దుర్గామాత దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223