సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండలం కందుకూరి లక్ష్మయ్య గారికి అభినందనలు
సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండలం చెందిన కందుకూరి లక్ష్మయ్య గారు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో నిబద్ధతతో, అంకితభావంతో కృషి చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారు. మన తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారి అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం శ్రమిస్తూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ప్రజలతో ఆప్యాయంగా మెలుగుతూ, "అన్నా... నేను ఉన్నాను!" అనే భరోసాతో ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తున్న కందుకూరి లక్ష్మయ్య గారి సేవాభావం నిజంగా అభినందనీయం.
"అన్నా... నేను ఉన్నాను! ప్రజల సేవే నా ధ్యేయం."
ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ ప్రెస్ కన్వీనర్ కందుకూరి లక్ష్మయ్య గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.