విద్యుత్ షాక్ తో రైతు మృతి

Sep 21, 2024 - 20:01
 0  5
విద్యుత్ షాక్ తో రైతు మృతి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ విద్యుత్ షాక్ తో రైతు మృతి. ఆత్మకూర్ ఎస్.. మండల పరిధిలోని కందగట్ల గ్రామంలో విద్యుత్ మోటారు వేసేందుకు ట్రాన్స్ఫార్మర్ వద్ద లైన్ ఆన్ చేస్తుండగా వైరు తెగిమీద పడి షాక్ కొట్టడంతో మంచాల సైదులు 62. అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంచాల సైదులు తన వ్యవసాయ భాగవత భావి వద్ద పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్ళగా ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ ఆఫ్ అయి ఉండడం తో ట్రాన్స్ఫార్మర్ ను ఆన్ చేయగా శిథిలావస్థలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైరు తెగి మీద పడడంతో తీవ్ర గాయాలు షాక్ తో మృతి చెంది నట్లు తెలిపారు. సమీపంలో ఉన్న మహిళా రైతు స్థానికుల సమాచారం ఇవ్వడంతో హాస్పటల్ తీసుకు ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు సైదులుకు భార్య ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు.