ముగ్గురు అక్క చెల్లెలను పెళ్లాడిన యువకుడు
ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు
తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ::ఉత్తరప్రదేశ్లోని ధౌరియా గ్రామానికి చెందిన సరోజ్ (20), సావిత్రి (19), సంతోష్ (18) సొంత అక్కాచెల్లెళ్లు. వీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా వీడియోలు చేసేవారు.
వారి కెమెరామెన్ అయినా శ్యాంపురి గ్రామానికి చెందిన వికాస్ అలియాస్ విక్కుతో ఆలయంలో వివాహం చేసుకున్నారు.
కుటుంబ సభ్యులు వేర్వేరుగా పెళ్లిళ్లు చేయాలని ప్రయత్నించడంతో, విడిపోవడం కంటే ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
స్థానిక హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది సనాతన సంప్రదాయాలకు విరుద్ధమని చెప్పినా ప్రతిస్పందనగా అక్కాచెల్లెళ్లు, పూర్వకాలంలో రాజులకు అనేక భార్యలు ఉండేవారు. అప్పుడు అది తప్పు కాలేదు. ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.