పాఠశాలలో మధ్యాహ్న భోజనం సంబంధించిన శిక్షణ కార్యక్రమం

జోగులాంబ గద్వాల 10 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఇటిక్యాల. పోషక విలువలతో కూడిన శుభ్రమైన ఆహారం తయారీ " అనే అంశంపై ఎర్రవల్లి మండలంలోని మండల విద్యాశాఖ కార్యాలయం నందు అన్ని రకాలైన (PS, UPS & HS) పాఠశాల HMs మరియు ఆయా పాఠశాలల CCH లతో మండల విద్యాశాఖ అధికారి అమీర్ పాషా మరియు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అవగాహనా సమావేశం జరిగింది.
ఈ సందర్బంగా ఎంఈఓ మాట్లాడుతూ వంట వండే ప్రదేశం శుభ్రంగా ఉండాలని, తాజా కూరగాయలు వంటకు వాడాలని, Menu ప్రకారం భోజనం చేయాలని ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం జరిగింది.