భూభారతిలో వచ్చిన దరఖాస్తులన్నీ ఆన్లైన్లో చేయాలి 

అదనపు కలెక్టర్ వీరారెడ్డి 

Jun 28, 2025 - 14:05
 0  4
భూభారతిలో వచ్చిన దరఖాస్తులన్నీ ఆన్లైన్లో చేయాలి 

అడ్డగూడూరు 28 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం రోజు అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా భూభారతిలో వచ్చిన దరఖాస్తులను పర్యవేక్షించారు.2064 వివిధ సమస్యలపై ఉన్న దరఖాస్తులను జూలై 31 లోగా విచారణ చేసి ఆన్లైన్లో నమోదు చేసి పరీక్షించాలని అధికారులకు ఆదేశించారు. దరఖాస్తుల్లో ఎలాంటి పొరపాటులకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శేషగిరి రావు, డిటి నరసింహారావు,ఆర్ఐ రాజేష్,ఉపేందర్, జూనియర్ అసిస్టెంట్లు నాగేష్ కుమార్, శ్రీనివాస్, కార్యాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333