బీచుపల్లి వద్ద NH-44పై రోడ్డు ప్రమాదం
డీసీఎం ఢీకొని డ్రైవర్కు స్వల్ప గాయాలు.. తప్పిన పెను ప్రమాదం..
గద్వాల: జాతీయ రహదారి NH-44పై బీచుపల్లి సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీచుపల్లి వద్ద టర్నింగ్ తీసుకుంటున్న సమయంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో వాహనం కొంతమేర దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్కు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.