సమగ్ర సస్యరక్షణ పై రైతులకు అవగాహన
డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ. జగ్గు నాయక్ ఆధ్వర్యంలో అవగాహన.*
జోగులాంబ గద్వాల 29 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల . పంటలపై పడే చీడపీడల నివారణ కోసం సమగ్ర సస్యరక్షణ యజమాన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించినట్లు. డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ జగ్గుల నాయక్ తెలిపారు. గద్వాల జిల్లా మండల లోని కురవపల్లి గ్రామంలో శనివారం యజమాన్య పద్ధతులపై గురించి మిత్ర పురుగులు శత్రు పురుగుల తేడాలను గుర్తించడం అదేవిధంగా వాటి నివారించే విషయాలపై అవగాహన కల్పించినట్లు వారు తెలిపారు. ఎరువులు రసాయనిక మందులు ఎక్కువ వాడకుండా పిలమూన్ ట్రా సు. లింగాకర్షణ బుట్టల ద్వారా వేప నూనె ద్వారా పిచికారి చేయడం వలన చీడపీడలను నివారించ వచ్చాను అన్నారు. పలు విషయాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. రసానిక ఎరువులను మరియు లింగాకర్షణ బుట్టలను మధ్య క్షేత్రస్థాయిలో అమర్చి లాభనష్టాలు గూర్చి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. పంట పొలాలకు వెళ్లి రైతులకు సమగ్ర సస్రక్షణ చర్యలపై సంబంధిత అధికారులతో అవగాహన కల్పించి నివారణ చర్యలు తగు జాగ్రత్తలు తదితర వంటి అంశాలను విశదీకరించి తెలపడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉపసంచాలకులు ప్రతాప్. డిపిడి ఆత్మ అధికారి. మండల వ్యవసాయ అధికారి ఆత్మ. రంగారెడ్డి రైతులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.