బిఅలర్ట్ : కృష్ణమ్మ నది పరివాహక ప్రజలు .

Jul 25, 2024 - 18:57
Jul 25, 2024 - 19:00
 0  66
బిఅలర్ట్ : కృష్ణమ్మ నది పరివాహక ప్రజలు .

జోగులాంబ గద్వాల 25 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల. జిల్లాలోని కృష్ణానది పరివాహ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు  హెచ్చరిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి డ్యాం నుండి భారీ వరద ప్రవాహం జూరాల ప్రాజెక్టుకు చేరుకోవడంతో 46 గేట్లుఎత్తి దిగువకు కృష్ణమ్మా వరద నీటిని విడుదల చేయడంతో దిగువకు శ్రీశైలం మల్లన్న స్వామి వైపుకు కృష్ణమ్మ ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. సుమారు 2 లక్షల 50వేల క్యూసెక్కులను వరద నీటిని విడుదల చేశారు. దీంతో నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరు కూడా నది వైపు వెళ్ళవద్దని అధికారులు జిల్లాలోని ప్రజలకు సూచిస్తున్నారు .

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State