పెద్ద దిన్నె గ్రామంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పరిశీలన ఎమ్మార్వో
జోగులాంబ గద్వాల 29 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి : ఇటిక్యాల . కేంద్ర రాష్ట్ర కమిషనర్ ఆదేశం మేరకు ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఇటిక్యాల మండలం రెవిన్యూ సిబ్బంది శనివారం పెద్దదిన్నె గ్రామాన్ని సందర్శించారు. ఇటిక్యాలఎమ్మార్వో తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జాబితాలో మ్యాపింగ్ జరగని పలువురు ఓటర్లకు నోటీసులు అందజేసినట్లు తెలిపారు.గడువులోగా సరైన ధృవపత్రాలతో సంబంధిత బిఎల్ఓ ల కు అందజేయాలని గ్రామంలోని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ మనోహర్,జీపీఓ పంచాయత్ కార్యదర్శి బిఎల్వోలు, బిఎల్ఎ లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.