పిల్లలమర్రికి చెందిన బిఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి ఆర్డీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక
సూర్యాపేట: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి వాగ్దానం అమలుకు కృషి చేస్తానని వార్డులో నెలకొన్న అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రజాపాలనలో భాగంగా రెండు మాసాలు పర్యటించి పరిష్కరిస్తానని మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ దామోదర్ రెడ్డి అన్నారు. వైట్ హౌస్ లో మాజీమంత్రి,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి.
సమక్షంలో సూర్యాపేట పట్టణంలోని 12 వార్డు పిల్లలమర్రి నుంచి మాజీ ఉప సర్పంచ్ చెరుకుపల్లి వెంకట్ లాల్ ఆధ్వర్యంలో, చింతా వెంకన్న, దూరేపల్లి దేవయ్య, చింతకింది వెంకన్న, లంజపల్లి మల్లయ్య సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినవారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలపై ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజాదర్బార్ లో వేలాది ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులతో మాట్లాడి ప్రతి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, 10 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ చింత వెంకన్న, సంద సైదులు, కోట్ల సైదులు,కోట్ల నవీన్, మల్లికార్జున్ , జెర్రిపోతుల నరేందర్,సాడక్, చేరుకుపల్లి బుచ్చిరాములు, చెరుకుపల్లి దేవయ్య, చెరుకుపల్లి టి,కే కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.