దౌదర్పల్లి గ్రామంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం
జోగులాంబ గద్వాల 1 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఈరోజు దౌదర్పల్లి గ్రామంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
••• ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
DIO ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్.,
DVLM నరేంద్రబాబు.
హెల్త్ సూపర్వైజర్ శ్యాంసుందర్ హాజరై మాట్లాడారు.
••• ప్రోగ్రాం ఆఫీసర్ * *మాట్లాడుతూ
1. పుట్టిన వెంటనే గంటలోపు తల్లిపాలు ఇవ్వాలి
2. 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి
3. తల్లి నుండి వచ్చే మొదటి పసుపు రంగు చిక్కని పాలు - "కొలొస్ట్రమ్" బిడ్డకు అమృతంతో సమానం
4. తల్లి అనారోగ్యంగా ఉన్నా సరే బిడ్డకు పాలు ఇవ్వవచ్చు
5. తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది..........
6. 2 సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం అందించడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, పోషకాహార లోపం తగ్గుతుంది అని తల్లులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో
ANM రాధ గారు, 7వ వార్డ్ అంగన్వాడీ టీచర్ చిట్టెమ్మ , ASHA కార్యకర్తలు సారిక, శంకరమ్మ
•••• దౌదర్పల్లి గ్రామ తల్లులు అందరూ తదితరులు పాల్గొన్నారు.