దళిత క్రైస్తవుల ప్రత్యేక హోదాకై సుప్రీంకోర్టు

Sep 27, 2024 - 17:18
Sep 27, 2024 - 17:33
 0  47
దళిత క్రైస్తవుల ప్రత్యేక హోదాకై సుప్రీంకోర్టు

 మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ కమిషన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ ప్రాంతాలనుండి నివేదికలు పెద్ద ఎత్తున సమర్పించాలి

న్యాయ పోరాటం కై తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో కోటి సంతకాలసేకరణచేపడతాం 

 బిషప్ దుర్గం ప్రభాకర్ తెలంగాణా రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బిషప్ సి. హెచ్. సాల్మన్ రాజు సూర్యాపేట పాస్టర్స్ గౌరవ సలహాదారులు  శుక్రవారం 27 సెప్టెంబర్ : సూర్యాపేట మున్సిపాలిటీ కేంద్రం నందు,బి బి గూడెం రిచ్ ఇండియా చర్చ్ నందు సూర్యాపేట పట్టణ పాస్టర్స్ పెలోషిఫ్ ప్రధాన కార్యదర్శి రెవ. దారావత్ లాకు నాయక్, సూర్యాపేట పట్టణ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ. ఇంజమూరి గాబ్రియేల్ ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గ మరియు పట్టణ సమావేశం ఏర్పాటు చేయగా ఈ యొక్క సమావేశంనికి ముఖ్య అతిదులుగా సూర్యాపేట పాస్టర్స్ పెలోషిఫ్ గౌరవ అధ్యక్షులు బిషప్ సి. హెచ్ సాల్మాన్ రాజు (మన్నా చర్చ్ )పాల్గొని దైవ వర్తమానం అందించారు. అనంతరం సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుర్గం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్రైస్తవం, ముస్లిం మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ నేతృత్వంలో కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందనీ,దళిత క్రిస్టియన్లను, దళిత ముస్లింలకు షెడ్యూల్డ్‌ కులాల(ఎస్సీ) రిజర్వేషన్‌ హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చిందనీ,వీరి స్థితిగతులపై అధ్యయనానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్‌ సారథ్యంలో కొత్త కమిటీ కేంద్రం ఏర్పాటు చేయటమే ఇందుకు కారణం అనీదేశంలో తరతరాల సామాజిక అవలక్షణం అంటరానితనం కారణంగా ఎస్సీలను బాధితులైన వర్గాలుగా భావించి రాజ్యాంగం వారికి రిజర్వేషన్లను కల్పించిందనీ.1950లో కేవలం హిందువుల్లోని ఎస్సీలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు కల్పించి మోసం చేశారని తర్వాత 1956లో సిక్కు మతంలోని దళితుల్నీ, 1990లో బౌద్ధ దళితుల్ని ఇందులో  బలవంతంగా చేర్చారనీ కేంద్ర ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేశారనీ. 2004లో మత, భాష పరమైన మైనార్టీలకు జాతీయ కమిషన్‌ ఏర్పాటు చేశారని, దీన్నే రంగనాథ్‌ మిశ్ర కమిషన్‌ అంటారనీ . ఈ కమిషన్‌ ఎస్సీ హోదాకు, మతానికి లంకె అవసరం లేదని సిఫార్సు చేసిందన్నారు.రెండోది జస్టిస్‌ రాజేందర్‌ సచార్‌ కమిషన్‌ దేశంలో ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యాసంబంధ పరిస్థితులపై 2005లో ఈ కమిటీ ఏర్పాటైందనీ. మత మార్పిడి తర్వాత కూడా దళిత ముస్లిం, దళిత క్రైస్తవుల పరిస్థితుల్లో మార్పు రాలేదని ఏడుగురు సభ్యుల సచార్‌ కమిషన్‌ తేల్చి చెప్పిందని అన్నారు.క్షేత్రస్థాయిలో పరిస్థితిని బేరీజు వేయటానికి అవసరమైన గణాంకాలు లేవనే కారణంతో ఈ కమిషన్‌ సిఫార్సులను ఆమోదించలేదనీ అన్నారు,తర్వాతికాలంలో సామాజిక శాస్త్రవేత్త సతీశ్‌ దేశ్‌పాండే సారథ్యంలోని ఓ కమిటీ 2008లో ఓ నివేదిక ఇచ్చిందనీ దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకూ ఎస్సీ హోదా విస్తరించాలంటూ సిఫార్సు చేసిందనీ గుర్తు చేశారు. జాతీయ మైనార్టీ కమిషన్‌ కూడా ఇలాంటి ప్రతిపాదనలే చేసిందనీ అన్నారు,అయినా కానీ సరైన గణాంకాలు లేనందున వీటన్నింటనీ పరిగణనలోకి తీసుకోలేదు కాబట్టి  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు కుల ఘనంకణ తో పాటు యస్. సి, యస్. టి & బి. సి మరియు ఓ.బి.సి. క్రిస్టియన్లు అన్నీ కులాల నుండి ఘనంకణ చెపట్టాలని త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టి  రాష్ట్ర పతికి, దేశప్రధాన మంత్రి కీ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కీ, జస్టిస్ కే. జి. బాలకిషన్ కమిషన్ కు ఎక్కడికి అక్కడ రాష్ట్రము లోని అన్నీ జిల్లాల నుండి నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో అందించలనీ తెలిపారు. ఈ కార్యక్రమం లో సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ గౌరవ సలహాదారులు రెవ. మిట్టగడుపుల హాజర్య, పాస్టర్ రాజా బాబు,పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రదర్ బొల్లు జాన్ పాల్, కోశాధికారి పాస్టర్ ఆర్. స్పర్జన్ రాజు, కన్వీనర్ పాస్టర్ వి. పిలిఫ్,నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సమూయేలు,సూర్యాపేట రూరల్ అధ్యక్షులు పాస్టర్ యల్క ప్రభాకర్,యం. రూబెన్, ఏర్పుల క్రిస్టోఫర్,రెవ. డా.పంది మార్క్,పాస్టర్ బానోత్ సుధాకర్,పాస్టర్ మిద్దె హెబ్రోన్ రాజు,కొమ్ము హోసన్నా, మోసే, దానియేలు,బోయాజ్,పాల్వాయి అజయ్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333