తల్లి కొడుకు కౌన్సిలర్లుగా గెలుపు
తిరుమలగిరి 13 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తల్లి కొడుకులిద్దరూ కౌన్సిలర్లుగా గెలిచిన అరుదైన సంఘటన చోటుచేసుకుంది వివరాలకు వెళితే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో తల్లి బిఆర్ఎస్ పార్టీ తరఫున బత్తుల శకుంతల నాలుగోవ వార్డు నుండి బరిలో నిలిచి కౌన్సిలర్ గా గెలుపొందారు కొడుకు బత్తుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏడవ వార్డు అభ్యర్థిగా నిలిచి కౌన్సిలర్ గా గెల్పొందాడు దీంతో ఓకే ఇంటి నుండి తల్లి కొడుకుల ఇద్దరు గెలవడంతో తిరుమలగిరి మండల వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది అలాగే వీరిద్దరూ గెలవడంతో వారి వారి వార్డులలో సంబరాలు జరుపుకుంటున్న పార్టీ శ్రేణులు