డ్రైనేజీని ఆక్రమించిన దుకాణదారులు.
రోడ్డుపై పారుతున్న మురుగునీరు.
.. తొమ్మిదో వార్డు రాయచూరు ప్రధాన రహదారి.
జోగులాంబ గద్వాల 27 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. కేంద్రంలోని తొమ్మిదవ వార్డు రాఘవేంద్ర కాలనీ రాయచూరు కు వెళ్లే మెయిన్ రోడ్డు లో దుకాణదారులు డ్రైనేజీ పై దుకాణం నిర్మించడంతో మురుగునీరు నిలిచిపోయి రోడ్డుపై పారుతున్నదని కాలనీవాసులు ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ తతంగం నడుస్తున్న మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై మొరుగునీరుపారడంతో పాదచారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కావున సంబంధిత మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టి మురుగునీరు వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.