వేముల గ్రామం లో ఐదు రోజులుగా నీటి కష్టాలు.

May 27, 2024 - 17:37
May 27, 2024 - 21:07
 0  15
వేముల గ్రామం లో ఐదు రోజులుగా నీటి కష్టాలు.

జోగులాంబ గద్వాల 27 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల. మండలం వేముల గ్రామంలో త్రాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.? గత ఐదు రోజులుగా మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరు రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఊరి చివరిలో పొలాలలో ఉన్న బోరు బావుల నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి త్రాగు నీళ్లు తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు . అధికారులు చర్యలు తీసుకుని త్రాగునీటి కష్టాలు లేకుండా చూడాలని గ్రామస్తులు కోరారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State