ఘనంగా శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం.

Feb 24, 2024 - 19:05
 0  4
ఘనంగా శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం.

జోగులాంబ గద్వాల 24 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మల్దకల్. ఆదిశిలా క్షేత్రం  శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీ, పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. దేవాలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీ కృష్ణమాన్య పట్వారి ప్రహ్లాద రావు,ఈ ఒ సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు భీమ్సేన్ చారి, మధుసూదనాచారి, రవి నాగరాజు శర్మ ఆధ్వర్యంలో కళ్యాణం వేదమంత్రాల మధ్య నిర్వహించారు. కళ్యాణాన్ని గార్లదిన్నె గ్రామానికి చెందిన మంజుల తిరుమల్ రెడ్డి, హైదరాబాద్కు చెందిన కసా లక్ష్మి వేణుగోపాల్, చిన్నచింతరావుల కు చెందిన వర్ల శ్రీనివాసులు, గద్వాలకు చెందిన మేఘన ధర్మతేజ, దన్వాడకు చెందిన మామిళ్ళ మహేష్ కుమార్  స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణం చేయించిన వారిని ఆలయ చైర్మన్ ఘనంగా సన్మానం చేశారు. అనంతరం భక్తులకు గార్లదిన్నె గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డి భక్తులకు అన్న సంతర్పణ చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333