మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న అదనపు కలెక్టర్.

Feb 24, 2024 - 19:04
 0  4
మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న అదనపు కలెక్టర్.
మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న అదనపు కలెక్టర్.

జోగులాంబ గద్వాల 24 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్. ఆదిశేలాక్షేత్రం  శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శనివారం జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు సందర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవాలయంలోని చరిత్ర వివరించారు. అలాగే దేవాలయం నుండి భక్తి మార్గంలో నిర్మించే సిసి రోడ్డు డ్రైనేజీ వరకు 28 మీటర్లు వేస్తే శాశ్వతంగా ఉంటుందని ప్రహ్లాద రావు అదనపు కలెక్టర్కు తెలుపగా అధికారులతో మాట్లాడి 28 మీటర్ల సిసి రోడ్డు డ్రైనేజీ వరకు వేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి చంద్రశేఖర రావు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333