ఘనంగా ఆరాధ్య పౌండేషన్ చైర్మన్ జన్మదిన వేడుకలు

అడ్డగూడూరు 26 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టుర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య పౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు.ఈసందర్భంగా ఆరాధ్య పౌడేషన్ సభ్యులు మాట్లాడుతూ వాణి శ్రీకాంత్ రాజ్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు కోసం కీలకంగా పనిచేసారు. ఆరాధ్య పౌండేషన్ స్థాపించి పేదలకు నిరంతరం సేవాభావంతో ఆదుకుంటున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ మండల అధ్యక్షులు బాల్లె రాజు, జిల్లా యూత్ అధ్యక్షులు కొమ్ము లింగస్వామి,సుత్తోజు సోమేశ్వరచారి,తాడోజు లక్ష్మణాచారి ,రాజుపేట వెంకటరమణ చారి ,కడారి అనిల్ ,మేడబోయిన రాజు, తాడోజు మదనాచారి,పెగడపెల్లి వీరస్వామి ,మారోజు వెంకటాచారి ,రాజుపేట సోమచారి ,రెడ్డిమల్ల రమేష్, సంద సోమన్న ,ఇటికాల చందు ,మేకల పవన్ రాజు ,కొత్తపెల్లి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.