గుక్కెడు నీటి కోసం ప్రాణాలతో చెలగాటం....

జోగులాంబ గద్వాల 3 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ధరూరు. మండల కేంద్రంలో మిషన్ భగీరథ నీటి పంపిణీ సరఫరా అంతరాయం ఎర్పడటం వల్ల ధరూర్ గ్రామంలో వాటర్ ట్యాంక్ పై నుండి ప్రజలు త్రాగడానికి బిందెల ద్వారా ప్రాణాలకు ప్రమాదం వున్న గుక్కెడు నీటి కోసం సాహసం చేస్తున్నారు. వీలైనంత త్వరగా నీటి సరఫరా అయ్యేటట్లు చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.