గద్వాల రైల్వే స్టేషన్ నుండి అయిజకు బస్సు ప్రయాణం
జోగులాంబ గద్వాల 9 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి గద్వాల:- బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ మీదగా అయిజకు బస్సులు ప్రయాణం ప్రారంభమయ్యాయి.ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ట్రైన్ సమయానికి సరైన వేళల్లో ఆర్టీసీ బస్సులు రైల్వే స్టేషన్ మీదుగా అయిజకు వెళ్లే విధంగా గద్వాల డిపో మేనేజర్ R మంజుల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై ఇటీవల ఎందరో డిఎం దృష్టికి తీసుకుపోవడంతో డి ఎం . R మంజుల ఎంక్వయిరీ అనంతరం సోమవారం నుంచి బస్సులు నడుపుతున్నట్లు ఆమె ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు. బస్సులు ప్రారంభం అయినందుకు గాను హర్షం వ్యక్తం చేస్తున్నా గద్వాల జిల్లా లోని ప్రయాణికలు...