ఏదులాపురం మున్సిపాలిటీ కి వరంగల్ క్రాస్ రోడ్ లో స్మశానం వాటిక ఏర్పాటు చేయాలి"ఏదులాపురం కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సురేష్ నాయక్

Oct 4, 2024 - 13:25
Oct 4, 2024 - 17:09
 0  5
ఏదులాపురం మున్సిపాలిటీ కి వరంగల్ క్రాస్ రోడ్ లో స్మశానం వాటిక ఏర్పాటు చేయాలి"ఏదులాపురం కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సురేష్ నాయక్

ఏదులపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్ లో స్మశాన వాటిక ఏర్పాటు చేయాలి పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్యా సురేష్ నాయక్ ఈ రోజు వరంగల్ క్రాస్ రోడ్ లో స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని ఖమ్మం రూరల్ ఏం ఆర్ ఓ గారిని మరియు ఖమ్మం రూరల్ ఎం డి ఓ గార్లను కలిసి 5000 జనాభా మరియు 3750 మంది ఓటర్లు ఉన్న వరంగల్ క్రాస్ రోడ్ కు స్మశాన వాటిక లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురౌతున్నారు.వర్ష కాలం లో ఖననం చేయాలంటే విపరీతమైన బూడద మరియు రోడ్ల సమస్య ఉందని వారు తెలిపారు.ఎవరైనా చనిపోతే కననం చేయుటకు యెదులపురం సుమారు 3 కిలోమీటర్లు,కాల్వడ్డు సుమారు 5 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది అని పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు మరియు బాధల గురించి ఏం ఆర్ ఓ మరియు ఏం డి ఓ గార్లకు వివరించడం జరిగింది. ఇట్టి విషయాన్ని ఖమ్మం ఆర్ డి ఓ మరియు కలెక్టర్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తాము అని హామి ఇవ్వడం జరిగింది.ఈ యొక్క విషయమై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్రుష్టి కి కూడా తీసుకెళ్తామని పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్యా సురేష్ నాయక్ తెలుపడం జరిగింది. వీరితో పాటు స్థానిక నాయకులు వెంపటీ.రవి, ఎన్ పి చారి, శేష్ రెడ్డి,భుజంగరావు తదితరులు పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State